కామారెడ్డి, మే 25: కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్పై సస్పెన్షన్ వేటుపడింది. మహిళా వైద్యులను లైంగికంగా వేధించినట్టు ప్రాథమిక విచారణలో నిర్ధారణ కావడంతో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఆయన్ను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మణ్సింగ్పై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఏడు కేసులు నమోదయ్యాయి. ఇటీవల అరెస్ట్ అయిన ఆయన బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.