మనోహరాబాద్: కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో ఆనందంగా జీవించే ఆ కుటుంబంలో సాయంత్రం విందు విషాదం నింపింది. అప్పటి వరకు సరదాగా గడిపిన పిల్లలు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురై మృత్యువాత పడ టంతో తల్లిదండ్రుల రోధనలు పలువురి కంటతడి పెట్టించాయి. కలుషిత ఆహారం తీసుకొని ఇద్దరు చిన్నారులు మృతి చెం దిన ఘటన మనోహరాబాద్లో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
ఎస్ఐ రాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన బుల్లె మల్లేశం, బాలమణి దంపతులకు ఇద్దరు పిల్లలు మనూషా, కుమార్లు. కాగా మల్లేశ్కు ఆర్థిక సమస్యలు తలెత్తడంతో బతుకుదెరువు కోసం మనోహరాబాద్కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు.
మనోహరాబాద్కు చెందిన సంద ఐలయ్య కోళ్లఫారంలో గత 8 నెలల క్రితం జీతానికి కుదిరాడు. భార్యా, పిల్లలతో కోళ్ల ఫా రంలో కావలిగా చేస్తున్నాడు. కాగా సోమవారం రాత్రి కోళ్ల ఫారంలో బలహీనంగా ఉన్న కోళ్లను కొని వండుకున్నారు. భార్య బాలమణి, పిల్లలు మనూషా, కుమార్లతో కలిసి రాత్రి భోజనం చేసి తమ్సప్ తాగి పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున మనూషా, కుమార్, బాలమణిలు తీవ్ర కడుపునొప్పితో, వాంతులు, విరేచనాలతో అవస్థలు పడ్డారు.
దీంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని మేడ్చల్ లోని మెహర్ దవాఖానకు అక్కడి నుంచి తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వ హించిన వైద్యులు అప్పటికే మనూషా (13), కుమార్ (10)లు మృతి చెందినట్లు ధృవీకరించారు. భార్య బాలమణి పరి స్థితి విషమంగా ఉండటంతో అక్కడే చిక్సిత చేస్తున్నారు. మృతుల తండ్రి బుల్లె మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజుగౌడ్ తెలిపారు.
వెంకటాయపల్లిలో విషాదఛాయలు..
కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో వెంకటాయపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గతేడాది వరకు మల్లేశ్ ఇక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ కూరగాయలు అమ్ముకునేవాడని, ఆర్థిక ఇబ్బందుల తో వలస వెళ్తే.. పిల్లలు ఇద్దరు కలుషిత ఆహారంతో మృతి చెందారని పలువురు గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న జడ్పీ చైర్పర్సన్ హేమలత సంతాపం వ్యక్తం చేశారు. వారిని అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.