హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలో వైద్య విద్యార్థులకు నేడు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం జరగాల్సిన ఎంబీబీఎస్ మైక్రో బయాలజీ పరీక్షను ఈ నెల 19న, బీడీఎస్ పెరియోడెంటాలజీ పరీక్షను 21న, పోస్ట్ బేసిక్ నర్సింగ్ పరీక్షను 30న నిర్వహించనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 12 నుంచి జరిగే పరీక్షల్లో ఎటువంటి మార్పులు ఉండవని పేర్కొన్నారు.