అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. జూన్ 19న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమాలోని ఓ గీతాన్ని సోమవారం విడుదల చేశారు. ‘ఆకాశమంతా..ఆనందమై..తెల్లారుతోందే నాకోసమై..యే జిందగీ ఇవ్వాళ…కొంగొత్తగా నవ్వేలా’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించగా గోపీసుందర్ స్వరాల్ని సమకూర్చారు..మలయాళీ సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నఫీసాహాన్యా ఆలపించారు. ‘ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రమిది. ప్రేమలోని సున్నితమైన భావాలకు అందమైన దృశ్యరూపంలా అలరిస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఆమని, మురళీశర్మ, జయప్రకాష్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రదీశ్ ఎమ్ వర్మ, సంగీతం: గోపీసుందర్, నిర్మాణ సంస్థ: జీఏ2పిక్చర్స్, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్.
మరిన్ని వార్తలు చదవండి..