యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీ నరసింహచార్యులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ మాడ వీధులు, ప్రాకారాలు, గర్భాలయ ముఖ మండపం, రాజగోపురాలు, క్యూ లైన్లను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఆలయ అధికారులు ఉన్నారు.