ఇంద్రధనుస్సులో సప్తవర్ణాలు చూస్తేనే మనసు పులకరించిపోతుంది. అలాంటిది 10 వేల రంగులను ఒకే దగ్గర చూస్తే ఎంత గొప్పగా ఉంటుందో కదా. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు బోగ బాలయ్య 10 వేల సహజ సిద్ధమైన రంగులతో చీర తయారుచేశారు. ఈ చీర నేయడానికి నెల రోజులు పట్టిందని బాలయ్య తెలిపారు. ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా ఇటీవల భారత్ చిత్రపటంతో 10 వేల రంగులను మేళవించి ఓ వస్ర్తాన్ని తయారు చేశారు.
– భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 21