విద్యానగర్ (కరీంనగర్), ఏప్రిల్ 13: కరీంనగర్కు చెంది న సీనియర్ జర్నలిస్టు జయప్రకాశ్ (జేపీ) మంగళవారం కన్నుమూశారు. 15 రోజుల క్రితం కరోనా పాజిటివ్ రాగా కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరారు. కొన్ని రోజుల తర్వాత నెగిటివ్ వచ్చినా ఆరోగ్యం విషమించడంతో మంగళవారం మృతి చెందారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జయప్రకాశ్ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం తెలిపారు.