సంగారెడ్డి : బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆందోల్ నియోజకవర్గంలోని
వివిధ మండలాల నుంచి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్(MLA Kranthi Kiran) సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంట్ కోతలు తప్పవన్నారు. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆదరించాలన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.