అలంపూర్, జూన్ 27 : ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించి, పనులు త్వరగా పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని శనివారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి ఉ మ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టు సాధన జేఏసీ సభ్యులు, అలంపూర్ జేఏసీ చైర్మన్ రామ్మోహన్, పాలమూరు అధ్యయన వేదిక కోకన్వీనర్ గద్వాల జిల్లా అధ్యక్షుడు హనుమంతు తదితరులు వినతిపత్రం అందజేశారు.
ప్రాజెక్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జేఏసీ నాయకులు నిషాక్, ఎండీ బాషా, గోపాల్రెడ్డి, ఆంజనేయులు, విజయ భాస్కర్రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.