నల్లగొండ : బీఆర్ఎస్లోకి చేరికల పరంపర జోరుగా కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షుతులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా..కేతపల్లి మండలం కొండకింది గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 30 కుటుంబాలు గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంత ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకోసం అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో కోట్ల లింగయ్య, కోట్ల వీరాస్వామి, కోట్ల శ్రీను, కోట్ల వెంకటయ్య, కోట్ల రామలింగం, సాగర్, మెజిశెట్టి చిరంజీవి, కోట్ల గోపి, నాగయ్య, తిరుపతమ్మ, యోగనందం, అంజయ్య, వెంకటయ్య తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోలి మంజుల వేణుమాధవ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.