హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో యూఎస్ కాన్సులేట్ జనరల్గా జెన్నిఫర్ లార్సన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగువారు వాషింగ్టన్ డీసీలో ఆమెకు ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారత రాయబార కార్యాలయం నుంచి ప్రత్యేక అతిథిగా డాక్టర్ రవి కోట హాజరయ్యారు. ఈ సందర్బంగా హైదరాబాద్ ప్రత్యేకతలను కాన్సులేట్ జనరల్కు ఆయన వివరించారు. జెన్నిఫర్ లార్సన్ మాట్లాడు తూ, రెండు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.
హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన ఆసియాలోనే అతిపెద్దదైన కాన్సులేట్ భవనాన్ని వచ్చే నవంబర్లో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం లో వాణిజ్యవేత్తలు, వ్యాపార దిగ్గజాలు పా ల్గొని జెన్నిఫర్ను అభినందించారు. అమెరికా ప్రభుత్వం అందజేసే ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘ప్రెసిడెంట్ వాలంటరీ అవార్డు’కు ఎంపికైన సాఫ్ట్వేర్ వ్యాపార దిగ్గజం రవి పులి మాట్లాడుతూ.. ఇరు దేశాలు పరస్పర సహకారంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.