హైదరాబాద్ : పీవీ పార్థీవదేహంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను పీవీ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. పీవీ నర్సింహారావు (PV Narsimha Rao) కుటుంబ సభ్యుల అభీష్టంమేరకే ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్కు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారన్నప్రకటనను పీవీ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి( MLC Vanidevi), కుమారుడు పీవీ ప్రభాకర్ రావు (PV Prabhakar Rao) ఖండించారు.
జీవన్రెడ్డి ప్రకటన పూర్తిగా అవాస్తవమని, ఆ ప్రకటన తమకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. పీవీ పార్థివదేహాన్ని హైదరాబాద్ తెచ్చేందుకు కుటుంబ సభ్యులు ఎంతమాత్రం సుముఖంగా లేకపోయినప్పటికీ, ఢిల్లీలో ఆయన స్మారకాన్ని (Memorial) నిర్మిస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చి బలవంతంగా హైదరాబాద్కు పంపారని గుర్తుచేశారు.
ఈ రోజువరకు ఢిల్లీలో, హైదరాబాద్లో కానీ ఆయన స్మారకాన్ని నిర్మించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పీవీ అంశాన్ని మరోసారి లేవనెత్తి మానిపోయిన గాయాలను తిరిగి గాయపర్చాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా జీవన్రెడ్డి మళ్లీ తమ కుటుంబాన్ని బాధ పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.