హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): బీసీల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శనివారం తెలిపారు.
జనగణనలో ఓ బీసీ సమగ్ర కులగణన నిర్వహించాలని, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీలకు మహిళా సబ్ కోటా కల్పించాలనే డిమాండ్లతో చలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రధాని మోదీ ఓబీసీ అయినా, ఓబీసీ డిమాండ్లను పరిషరించలేదని ధ్వజమెత్తారు. బీసీలకు మోదీ, బీజేపీ ప్రభుత్వం చేసిన వైఖరిని ఎండగట్టడానికి ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు.