CM KCR | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ‘అబ్కీ బార్ కిసాన్ సరార్’ అనే నినాదంతో రైతు సంక్షేమ రాజ్యం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పది’ అని జగద్గురు పంచాచార్య స్వామీజీలు ప్రశంసించారు. సాధు సంతులను ఆదరించే విషయంలో ‘కేసీఆర్ కలియుగ జనకుడు’ అని అభివర్ణించారు. ‘వేలాదిమంది సాధువులను ఏకకాలంలో ఆహ్వానించి వారిని గౌరవించడం ఆనాడు జనక మహారాజుకే సాధ్యమైంది. తిరిగి నేడు వర్తమాన భారతదేశంలో తెలంగాణలో సీఎం కేసీఆర్కే సాధ్యపడింది’ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం సహా అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో అన్నదాతలుసహా సమస్త కులవృత్తులవారు, ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలనతోనే ఇది సాధ్యమైందని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వీరశైవ పంచపీఠంలోని కాశీ, ఉజ్జయిని, శ్రీశైల పీఠాల జగద్గురువులను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర శివాచార్య మహాస్వామి (కాశీ), సిద్ధలింగ శివాచార్య మహాస్వామి (ఉజ్జయిని), చెన్న సిద్ధ రమా పండితారాధ్య శివాచార్య మహాస్వామి (శ్రీశైలం) శనివారం ఉదయం ప్రగతి భవన్కు విచ్చేశారు. వీరితోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు శివాచార్య మహాస్వాములు ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్, శోభ దంపతులు పాల్గొన్నారు. జగద్గురువులు పుణ్య వచనాలు పలికారు. ‘పదేండ్ల అనతికాలంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సేవ గొప్పది. రైతుకు సాగునీటిని అందించడం గొప్ప విషయం. వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచి, రైతులను కాపాడుతున్న సీఎం కేసీఆర్ పాలన ఆదర్శవంతమైంది.’ అని కొనియాడారు. దేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసే దిశగా సీఎం కేసీఆర్ తలపెట్టిన నయా భారత్ నిర్మాణంలో తమ సహకారం, ఆశీర్వాదాలు అన్ని సందర్భాల్లోనూ ఉంటాయని తెలిపారు. సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తూ సాధు పుంగవులను ఆదరించడం గొప్ప విషయమని, సీఎం కేసీఆర్ అభినందనీయుడని పేర్కొన్నారు.
రాష్ట్రం అవతరించి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రజలను ఆశీర్వదించేందుకు జగద్గురువులు స్వయంగా రావడం తెలంగాణ ప్రజలందరి భాగ్యం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘దేశంలో నీరు, విద్యుత్తువంటి సహజ వనరులు పుషలంగా లభ్యమవుతున్నాయని.. అయినా 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో కేంద్రంలోని పాలకుల నిర్లక్ష్యం వల్ల దేశ వ్యవసాయ రంగం ఎంతో నష్టపోయింది. వ్యవసాయానికి సాగునీరు..విద్యుత్తు లేక రైతాంగం అల్లాడుతున్నది. ఈ నేపథ్యంలో రైతు సంక్షేమ పాలన ఈ దేశానికి ఎంతో అవసరమున్నది. నయా భారత్ నిర్మాణం కోసం మీ సంపూర్ణ సహకారం, ఆశీర్వాదం కావాలి’ అని కోరారు. అనంతరం జగద్గురువులు సీఎం కేసీఆర్ దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించి, ఫలప్రసాదాలు అందజేశారు. పంచాచార్య స్వామీజీలను సీఎం కేసీఆర్ సంప్రదాయ పద్ధతిలో సతరించారు. కార్యక్రమంలో ఎంపీ సంతోష్కుమార్, ఎంపీ బీబీ పాటిల్ దంపతులు, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు శంకరన్న దోండ్గే, మాణిక్రావు కదమ్, హిమాన్షుతివారీ తదితరులు పాల్గొన్నారు.