హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీ బలంగా లేదని స్వయంగా ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అంగీకరించారు. 119 నియోజకవర్గాలకు సరిపడా నాయకులు, క్యాడర్ లేరని పేర్కొన్నారు.
సోమవారం ఆయన ‘మీట్ ది ప్రెస్’లో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణలో ఇంకా స్థిరపడలేదని చెప్పారు. హైదరాబాద్తోపాటు నాలుగైదు జిల్లాల్లో మాత్రమే ప్రభావం చూపించగలుగుతుందన్నారు. పార్టీ బలం గా లేని స్థానాలను జనసేనకు ఇచ్చినట్టు చెప్పారు. మ్యానిఫెస్టో ఇంకా తయారవుతూనే ఉన్నదని, ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేమని అన్నారు.