న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: లంచగొండి అయిన స్నేహితుడు తప్పించుకోవడానికి సాయం చేసిన ఇన్కం ట్యాక్స్ అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. గుజరాత్లో విధులు నిర్వర్తిస్తున్న ఐఆర్ఎస్ అధికారి సంతోష్ కర్నాని లంచం అడుగుతున్నట్టు గత ఏడాది ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో అధికారులు ట్రాప్ చేసి కర్నానీని పట్టుకోవడానికి యత్నించారు. అయితే కర్నాని పారిపోవడానికి ఇన్కం ట్యాక్స్ అధికారి వివేక్ జోహ్రి సహకరించాడు. చివరికి ఈ కేసును గుజరాత్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు వివేక్ జోహ్రీని అరెస్టు చేశారు.