హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్కు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సమావేశానికి ఆహ్వానం అందింది. అక్టోబర్ 4న స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిచ్లో నిర్వహించనున్న ఆసియా లీడర్స్ సిరీస్ ఫోరం సమావేశంలో పాల్గొనాలని ఆ సంస్థ ఆహ్వానించింది. ఆసియా-యూరప్ ఖండాల్లో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితి, దెబ్బతింటున్న వ్యాపార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఈ రెండు ఖండాల్లోని వివిధ రంగాల నిపుణులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ‘మీలాంటి గౌరవనీయమైన, ప్రభావవంత వ్యక్తుల మధ్య అర్థవంతమైన, ఆలోచనాత్మక చర్చను నిర్వహించడం మా లక్ష్యం’ అని కేటీఆర్కు పంపిన ఆహ్వానంలో ఆసియా లీడర్స్ సిరీస్ వ్యవస్థాపకుడు కల్లమ్ ఫ్లెచర్ తెలిపారు. ఈ ఆహ్వానంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. వివిధ రంగాల ప్రముఖులతో ఆలోచనలు పంచుకొనేందుకు ఇది చకటి వేదిక అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎం16) మాజీ చీఫ్ సర్ జాన్ సార్లెట్, ఎల్డీసీ గ్రూప్ చైర్ లార్డ్ జిమ్ ఓనీల్, గోల్డ్మన్ సాచ్స్ అసెట్ మేనేజ్మెంట్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ విద్యా సక్సెనా తదితరులు పాల్గొంటారు.