హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో గోవా ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకొన్నది. గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంలో భాగంగా ఐఎస్బీలోని భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నేతృత్వాన ‘ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంఫాక్ట్ ఇన్ ది స్టేట్’ అంశంపై దృష్టిసారిస్తారు. గోవా రాష్ట్ర ప్రణాళిక, స్టాటిస్టిక్స్ అండ్ ఎవల్యూషన్ డైరెక్టర్ విజయ్బీ సక్సేనా, భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛత్రేలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఐఎస్బీ గోవా.. ఓపెన్ డాటా పోర్టల్ను అభివృద్ధిచేస్తుంది. బయో ఎనర్జీ రిజర్వులను పొందడం, అడవుల్లో నివసించే తెగల సాధికారత కోసం పాలసీలను రూపొందించనున్నది.