హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్మించ తలపెట్టిన ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదటి దశ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.
అచ్చంపేటలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటితోపాటు నియోజకవర్గంలో 57,200 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఈ స్కీమ్ మొదటి దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. లిఫ్ట్ స్కీమ్ను రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయించారు. మొదటిదశలో రిజర్వాయర్తోపాటు కెనాల్ నెట్వర్క్, పంప్హౌస్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సి ఉన్నది. అందుకుగాను ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. తాజాగా రూ.1,061.39 కోట్లతో ప్రతిపాదించిన పనులకు తాజాగా టెండర్లను ఆహ్వానించింది.