హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథమ్) సంస్థ పర్యాటక, సేవల రంగానికి సంబంధించిన వివిధ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఎంబీఏ, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఎంబీఏకు డిగ్రీ, బీబీఏ, బీఎస్సీకి ఇంటర్ 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నది. ఎంబీఏ కోసం 9553700035, 7842455581, బీఎస్సీ కోసం 9515241607, 040-23000472 నెంబర్లపై సంప్రదించాలని సూచించింది. www. nithm.ac.in వెబ్సైట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నది.