హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): ప్రముఖ బ్యాటరీల తయా రీ కంపెనీ అమరరాజా రాష్ట్రంలో లీథియం-ఇయాన్ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నది. దీనికి సంబంధించి సంస్థ ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు.
ఈ సందర్భంగా పెట్టుబడి వివరాలను సంస్థ ప్రతినిధులు వెల్లడించనున్నారు. కార్యక్రమంలో అమరరాజా బ్యాటరీస్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొంటారు.