హైదరాబాద్, జనవరి 24(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభు త్వం కన్ఫర్డ్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పించిన 25 మందికి ఢిల్లీలో ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. మంగళవారం వీ శ్రీనివాసులు, ఎస్ సురేశ్, కే హరిత, డీ శ్రీనివాస్నాయక్, ఎన్ యాదగిరిరావు, కే చంద్రశేఖర్రెడ్డి, ఈవీ నర్సింహారెడ్డి, అశోక్రెడ్డి, సైదా, మహేందర్, పశాంత్కుమార్, వెంకన్న, నవీన్ నికోలస్, సర్వేశ్వర్రెడ్డికి ఇంట ర్వ్యూ నిర్వహించారు. మిగతా 11మందికి శుక్రవారం జరుగుతాయి. సెలక్షన్ కమిటీలో సీఎస్ శాంతికుమారి, జీఏడీ కార్యదర్శి సోమేశ్కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.