హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : సింగరేణి దవాఖానల్లో స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి మంగళవారం ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో గురువారం వరకు ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగనున్నది. మొత్తం 13 రకాల పోస్టుల్లో నిపుణులైన వైద్యుల భర్తీ కోసం కొత్తగూడెం రిక్రూట్మెంట్ విభాగం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నది. మంగళవారం జనరల్ సర్జన్, ఈఎన్టీ, ఆర్థో సర్జన్, ఆఫ్తాల్మాలజీ విభాగాలకు గాను 33 మంది వైద్యులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. బుధవారం ఫిజీషియన్(జనరల్ మెడిసిన్), గైనకాలజిస్టు, రేడియాలజిస్టు, పాథాలజిస్ట్, హెల్త్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.