హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఆయుర్వేదంపై హైదరాబాద్లో జనవరి 21న తొలిసారి అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు ఎస్జీపీ సంస్థ వెల్లడించింది.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ సహకారంతో నిర్వహించే ఈ సదస్సు కు దేశ, విదేశాల నుంచి 400 మంది ఆయుర్వేద నిపుణులు రానున్నారు.