అమీర్పేట్, ఆగస్టు 13: ‘ప్రిజర్వ్’ పేరుతో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో ‘లోయర్ లింబ్ జాయింట్ ప్రిజర్వేషన్’ అంశంపై నిర్వహించిన జాయింట్ రీప్లేస్మెంట్స్ అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్షాప్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ సదస్సులో 500 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయస్థాయి ఆర్థోపెడిక్ సర్జన్లు పాల్గొన్నారు. ఆదివారం రెండోరోజు జ్యోతిప్రజ్వలన చేసి సదస్సును ప్రారం భించిన భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ ఆర్థోపెడిక్ రంగంలో జాయింట్ రీప్లేస్మెంట్ చికిత్సలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విధానాలను జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో లైవ్ వర్క్షాప్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించడం యువ సర్జన్లకు ఉపయోగపడుతుందన్నారు.
లైవ్ వర్క్షాప్లో అధునాతన ఆర్థ్రోస్కోపిక్ పద్ధతులు, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, రోబోటిక్ శస్త్రచికిత్సలను ప్రదర్శించారు. యశోద హాస్పిటల్స్ గ్రూప్ ఎండీ డాక్టర్ జీఎస్రావు మాట్లాడుతూ ఈ సదస్సు యువ సర్జన్లకు ఉపయోగపడిందని చెప్పారు. కార్యక్రమంలో యశోద దవాఖాన (సికింద్రాబాద్) సీనియర్ ఆర్థోపెడిక్ జాయిం ట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ నితిన్కుమార్తో పాటు తెలంగాణ ఆర్థోపెడిక్ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.