హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : వీఐటీఏపీ క్యాంపస్లో తులనాత్మక చట్టంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు వీఐటీఏపీ వర్సిటీ వీసీ ఎస్వీ కోట రెడ్డి తెలిపారు. 15న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సదస్సు.. 17న ముగుస్తుందని పేర్కొన్నారు.
ఈ సదస్సులో “అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారంలో సాంకేతికత అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, అవకాశాలు, సవాళ్లు”, దేశంలో తులనాత్మక ప్రజా చట్టం, అభ్యాసాలపై చర్చిస్తున్నట్టు వివరించారు. శుక్రవారం సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టీస్ రవీంద్ర భట్ మాట్లాడుతూ.. దేశంలోని అంతర్జాతీయ స్థాయి న్యాయ వ్యవస్థ ప్రాధాన్యాన్ని వివరించారు.