హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఫిబ్రవరి 21, 23 తేదీల్లో సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఇక్రిశాట్లో అంతర్జాతీయ సదస్సు జరుగనున్నది. బీడు భూముల్లో సాగు విధానాలు, అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్రతోపాటు, ఆఫ్రికా దేశాల్లో బీడుభూముల నిర్వహణపై ఈ సదస్సులో నిపుణులు చర్చించనున్నారు. బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నదని, ఆసక్తిగల విద్యార్థులు, నిపుణులు పేర్లు నమోదు చేసుకోవాలని ఇక్రిశాట్ వర్గాలు తెలిపాయి.