హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్, ఫి బ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జీవన్దాన్కు అంతర్జాతీయ అవార్డు లభించింది. మరణించిన వారి అవయవాలను సేకరించి ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్కు అసాధారణమైన కృషిచేసినందుకుగానూ అంతర్జాతీయస్థాయి లో జీవన్దాన్ ఖ్యాతి గడించింది. దుబాయిలోని కాన్రాడ్ హోటల్లో జరిగిన యూఏఈ వార్షిక ఆర్గాన్ డొనేషన్, ట్రాన్స్ప్లాంట్ కాంగ్రెస్లో తెలంగాణ జీవన్దాన్కు ‘హయత్ ఇంటర్నేషనల్ ఎక్స్లెన్స్ ఫ్రేమ్వర్క్’ అవార్డు దక్కిం ది.
ఈ అవార్డును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్గాన్ డొనేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ అలీ అబ్దుల్ కరీం ఓబైద్లి, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ మరియా పాలా గోమెజ్ చేతుల మీదుగా జీవన్దాన్ తెలంగాణ ఇన్చార్జి ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వర్ణలతను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. గురువారం నిమ్స్ దవాఖానలో డా క్టర్ స్వర్ణలతకు డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, డీన్ డా క్టర్ లీజా రాజశేఖర్, అసోసియేట్ డీన్ డాక్టర్ సాయిబాబా, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ శాం తివీర్, వైద్యులు అభినందనలు తెలిపారు. ఒకప్పుడు కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను కేసీఆర్ సర్కారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించింది.