జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పోటీలు రక్తికట్టించాయి. ఆలయ ప్రాంగణంలో దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 12 పొట్టేళ్లు పాల్గొన్నాయి.
ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ పోటీలను ఆసక్తిగా తిలకించారు. మొదటి బహుమతి హైదరాబాద్కు చెందిన అలీ (పుష్పరాజ్) (రూ.20,016), రెండో బహుమతి కర్నూల్ జిల్లా బీ తాండ్రపాడుకు చెందిన పరశురాముడు (రూ.15,016), మూడో బహుమతి జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన మా బాషా (రూ.10,016), నాలుగో బహుమతి కర్నూల్ జిల్లా బీ తాండ్రపాడు గ్రామానికి చెందిన హనుమాన్ (రూ.5,016) పొట్టేళ్లు గెలుచుకున్నాయి.