హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును అధికారులు పొడిగించారు. ఆగస్టు 16 వరకు విద్యార్థులు కాలేజీల్లో చేరే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఇంటర్ విద్య కమిషనర్ నవీన్మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుది గడువు నాటికి రూ.500 ఆలస్య రుసుము చెల్లించి కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చని ఆయన సూచించారు.