హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ( Inter Exams ) శుక్రవారంతో ముగిశాయి. ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమైన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు పగడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి ( Borad Secretary ) వెల్లడించారు.
నిరంతర నిఘా, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిఘాను పటిష్టంగా అమలు చేయడం, పరీక్ష కేంద్రాల తనిఖీల వల్ల మాల్ ప్రాక్టీస్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. గత ఏడాది 2025లో రాష్ట్రవ్యాప్తంగా 115 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదవగా ఈ యేడాది 54 మాత్రమే కేసులు నమోదయ్యానట్లు వివరించారు.
స్టేట్ అబ్జర్వర్లు, హైపవర్ కమిటీ, జిల్లా పరీక్షల కమిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు 10,426 కేంద్రాలను సందర్శించారని పేర్కొన్నారు. గత ఏడాది కంటే 1,876 కేంద్రాలను అధికంగా సందర్శించారని వివరించారు.