హైదరాబాద్, మే 19(నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు.. జనగణన విధులతో ఇంటర్ విద్యాసిబ్బందికి తలనొప్పులు తప్పడం లేదు. 272మందికి డబుల్ డ్యూటీలు పడ్డాయి. ఈ నెల 13న ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 21తో ముగుస్తాయి. జవాబుపత్రాల మూ ల్యాంకనం మే 31వరకు జరుగనున్నది. మే 11నుంచి జనగణన ప్రారంభం కా నున్నది. పరీక్ష డ్యూటీ పడిన 272మంది సిబ్బందికి జనగణన డ్యూటీలేశారు. 100మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 107 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 4 డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్, ఒక హైపర్ కమిటీ, 29మంది కస్టోడియన్లు, 10 మంది సిట్టింగ్, 4 ఫ్లయింగ్ స్కాడ్, 27మంది ఇన్విజిలేటర్ల చొప్పున డ్యూటీలేశారు. ఒకే సమయంలో రెండు డ్యూటీలుండటంతో ఆందోళన వ్యక్తమ వుతున్నది.
పీజీఈసెట్ పరీక్షలపై బక్రీద్ ఎఫెక్ట్
హైదరాబాద్, మే 19(నమస్తే తెలంగాణ) : ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష పీజీఈసెట్ షెడ్యూల్ మారింది. 28న బక్రీద్ ఉండగా, అదే రోజు నుంచి 31వరకు నాలుగు రోజుల పాటు పరీక్షలు నిర్వహించాల్సి ఉ న్నది. పండుగ కారణంగా ఈ పరీక్షలు 29న ప్రారంభమై, జూన్1న ముగుస్తాయి. 22న హాల్టికెట్లను విడుదల చేస్తామని కన్వీనర్ వెంకటేశ్వర్రావు తెలిపారు.