హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోని వనరులను సమర్థంగా వినియోగించుకోవడంపై శిక్షణ, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ), సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ (సీఐపీఎస్) సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేండ్లు అమల్లో ఉండే ఈ ఒప్పందంపై ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీ నరేంద్ర కుమార్, సీఐపీఎస్ డైరెక్టర్ సీ అచలేందర్రెడ్డి బుధవారం సంతకాలు చేశారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తొలి దశలో వెదురు, తేనె, మునగ ఆకుతో వివిధ రకాల ఉత్పత్తులు తయారుచేసి విక్రయించడం, చేపల పెంపకంలో ఆధునిక మెళకువలపై శిక్షణ ఇస్తారు. గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు కూడా శిక్షణా కార్యక్రమాలు చేపతారు. కార్యక్రమంలో ఎన్ఐఆర్డీ ప్రొఫెసర్ డాక్టర్ జీ వెంకటరాజు, డాక్టర్ రమేశ్ శక్తివేల్, ఎన్ఐఆర్డీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ మనోజ్కుమార్, సీఐపీఎస్ సలహాదారు ఫరీద్ అహ్మద్ పాల్గొన్నారు.