హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా నల్లగొండ జిల్లాకు చెందిన జీ ఇందిర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన పీ రాఘవదేవి, కోశాధికారిగా సూర్యాపేట జిల్లాకు చెందిన పల్లెటి సరస్వతి ఇటివల జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. వీరితోపాటు 16 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎస్ తిరుమల, పొట్లూరి ఉషారాణి, రోడ్డ లక్ష్మి, కృష్ణకుమారి, కే జ్యోతి, గుండెబోయిన రజిత, సుల్తాన్ ఉమ, ఆశ బేగం, ఎం అరుణ, అసరా లక్ష్మి, ఈ సుమలత, ఎల్ మమత, ఏ మంజుల, దొడ్డ లక్ష్మి, పల్లె రజని, కల్లెపల్లి జ్యోతి వీరిలో ఉన్నారు. జిల్లాలవారీగా డైరెక్టర్లను ఎన్నుకోవడానికి గత నెల 29న ఎన్నికలు జరిగాయి.