హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : రైల్వే టికెట్ బుకింగ్ విధానంలో కొన్ని దశాబ్దాలుగా ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ ఆగస్టు నుంచి సరికొత్త ‘ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్’ ప్రవేశపెట్టనుంది.
దాదాపు 1986 నుంచి వాడుకలో ఉన్న పాత సాంకేతిక విధానాన్ని సరికొత్త వ్యవస్థతో పూర్తిగా మార్చేయనుంది. కొత్త బుకింగ్ విధానంలో నిమిషాల వ్యవధిలోనే లక్షలాది టికెట్లను ఎలాంటి సర్వర్ సమస్యలు లేకుండా బుక్ చేసుకోవచ్చు.