రవీంద్రభారతి, మే 7: భారతీయ సనాతన సంసృతిని కాపాడుకోవాలని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి మహాస్వామి పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో శనివారం దర్శనమ్ ఆధ్యాత్మిక వార్త మాసపత్రిక ఆధ్వర్యంలో ఆయనకు గురువందనమ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహ భాషణం చేశారు. భారతీయ సంసృతిని కాపాడుకొని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. తెలుగు భాషతో పాటు కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉన్నదని అన్నారు. పాశ్చాత్య సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్నదని, రాబోయే రోజుల్లో కుటుంబ వ్యవస్థను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ధర్మాన్ని గుర్తించి ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. మాతృభాష తెలుగును మరువకూడదని అన్నారు. పుష్పగిరి పీఠాధిపతి విద్యశంకర భారతి స్వామీజీ మాట్లాడుతూ.. ధర్మం ఆలోచింపచేసేది కాదని, భవిష్యకాలంలో ఆచరించేదని అన్నారు. ధర్మాన్ని అలవర్చుకొని బ్రహ్మజ్ఞానాన్ని ఆచరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. అజ్ఞానాన్ని తొలగించటానికి ఆదిశంకరాచార్యులు ఉద్భవించారని పేర్కొన్నారు. అనంతరం దర్శనమ్ ఆధ్యాత్మిక పత్రిక ప్రత్యేక సంచికను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆవిషరించారు. కార్యక్రమంలో భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి, సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి, దర్శనమ్ పత్రిక సంపాదకుడు ఎం వెంకటరమణ శర్మ పాల్గొన్నారు.