హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): భారత సేనకు సంబంధించి ఆర్టిలరీ సెంటర్ ఏర్పాటు చేసి 60 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే మోటర్ సైకిల్యాత్రను ఏపీ, తెలంగాణ సబ్ఏరియా గ్రూప్ ఆఫీసర్, మేజర్ జనరల్ మన్రాల్ శనివారం ప్రారంభించారు.
భారత సైన్యానికి చెందిన 16 మంది సభ్యుల బృందం బైక్యాత్ర 13 రోజుల్లో సుమారు 3వేల కి.మీ.మేర సాగనున్నది. కేంద్రం నూతనంగా ప్రారంభించిన ‘అగ్నిపథ్’లో యువత చేరేలా ఈ యాత్రలో అవగాహన కల్పించనున్నారు. ఈ యాత్ర అనంతపురం, బెంగళూరు, సేలం, మధురై, తిరుచిరాపల్లి, పుదుచ్చేరి, చెన్నై, శ్రీహరికోట, సూర్యలంక మీదుగా తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నది.