హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తె లంగాణ): దేశవ్యాప్తంగా ఓ వైపు ఇన్ఫ్లూయెంజా ఆందోళన కలిగిస్తుండగా, కొవిడ్ కేసుల్లోనూ కాస్త పెరుగుదల కనిపిస్తున్నది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు వా రం రోజుల్లోనే దాదాపు రెట్టింపయ్యా యి. ఈ నెల 6న 20 కేసులుండగా, తాజాగా 32 కేసులు నమోదయ్యాయి. 9న 42 కేసులు వెలుగు చూశాయి. వాస్తవానికి కొవిడ్ ప్రభావం ఏడాది కిం దటే తగ్గిపోయింది. మూడేండ్ల తర్వాత జనవరి 28న తొలిసారి రాష్ట్రంలో సు న్నా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మధ్య కేసు ల్లో కాస్త పెరుగుదల కనిపిస్తున్నది. ఇది పెద్ద విషయం కాదని, కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు చెప్తున్నారు.