High Rise Buildings | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు నానాటికీ పెరుగుతున్నాయి. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని శ్రేణి పట్టణాల్లోనూ హైరైజ్ భవనాల నిర్మాణలు భారీగా జరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక తెలంగాణలో భూముల ధరలు భారీగా పెరగడం, దేశంలోనే అత్యధిక ధాన్యం ఇక్కడే పండుతుండటం, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు పుష్కళంగా నీరు, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తు అందుతుండటం, రైతుబంధు లాంటి పథకాలతో ప్రజల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడటమే ఇందుకు కారణం. దీంతో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణా ల్లో భారీ భవనాల ని ర్మాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఒక్క వరంగల్లోనే అత్యధికంగా 389 హైరైజ్ భవనాల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నట్టు టీఎస్బీపాస్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
లేఔట్లలోనూ అదే జోరు
పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులు ఉన్న లేఔట్లకు టీఎస్బీపాస్ ద్వారా సులభంగా అనుమతులు ఇస్తున్నది. దీంతో కొత్త జిల్లా కేంద్రాలతోపాటు ఆలేరు, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొదాడ లాంటి చిన్న పట్టణాల్లోనూ పెద్ద సంఖ్యలో లేఔట్లు ఏర్పాటవుతున్నాయి.