హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలు గడ్డు పరిస్థితులను అధగమిస్తున్నాయి. గత నాలుగేండ్లుగా వివిధ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. రాష్ట్రంలో 2015లో 258 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా సీట్లు నిండకపోవడం, నిర్వహణ లోపాలు తదితర కారణాలతో 2022 నాటికి 71 కాలేజీలు మూతపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 177 కళాశాలలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది వీటిలో చేరిన విద్యార్థుల సంఖ్య.. 2015లో ప్రవేశాలు పొందినవారి కంటే ఎక్కువగా ఉండటం విశేషం. 2015లో 258 కాలేజీల్లో కలిపి 51,621 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందగా, 2022లో 177 కాలేజీల్లో 61,702 మంది చేరడం విశేషం.
ఇంజినీరింగ్లో ప్రవేశాలు పెరగడానికి కారణాలు