ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నాంపల్లిలోని తెలంగాణ ఉద్యావనశాఖ శిక్షణా సంస్థలో ఆయిల్పామ్ సాగు ప్రోత్సాహంపై బ్యాంకర్ల కమిటీతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు, రైతులకు ప్రోత్సాహకాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంట సాగు ఉద్ధృతం చేయాలని రైతులకు సూచించారు. ఎకరా సాగుకు మొదటి నాలుగేండ్లు రూ.1.38 లక్షలు ఖర్చు అవుతుందని, ఈ మొత్తంలో ప్రభుత్వం రూ. 31.832 వరకు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. దేశంలో 8.25 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగులో ఉందని చెప్పారు. ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- 'రాహుల్గాంధీ మీకు అబద్దాలు చెప్పడానికి సిగ్గనిపించదా..?'
- సీబీఐకి ఊమెన్ చాందీపై లైంగిక దాడి కేసు
- డీఆర్డీవోలో అప్రెంటిస్లు
- రెండేళ్ల కూతురికి జడ చిక్కులు తీసిన హీరో
- హ్యాపీ బర్త్ డే పుజారా..
- దేశంలో ఊబకాయులు పెరుగుతున్నారు..
- హైదరాబాద్ నవాబు వారసత్వం కేసును తేల్చండి : సుప్రీం
- ఇదోరకం కల్లు..!
- వచ్చే ఏడాది నౌకాదళం అమ్ములపొదిలోకి INS విక్రాంత్!
- వాట్సాప్ ప్రైవసీ పాలసీ : కేంద్రం ఫైర్