హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను సీఎం కేసీఆర్ 10 వేలకు పెంచనున్నట్టు పీఆర్టీయూ టీఎస్ ప్రతినిధులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు బుధవారం తెలిపారు. సీఎం ఆదేశంతో అదనంగా 5,571 పీఎస్హెచ్ఎం పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని.
ఆ ఫైల్పై ఆర్థిక మంత్రి హరీశ్రావు సంతకం చేశారని, వారం రోజుల్లో జీవో విడుదలవుతుందని పేర్కొన్నారు. పోస్టులను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు.