హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): వీరశైవ లింగాయత్/లింగబలిజ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప, గౌరవ అధ్యక్షుడు పట్లోళ్ల సంగమేశ్వర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ కోరారు.
న్యూఢిల్లీలో నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారాం అహిర్ను బుధవారం వారు ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించి త్వరలోనే ఓబీసీ జాబితాలో కలిపే ప్రయత్నం చేస్తామని నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శెట్టి శివకుమార్, రాష్ట్ర కోశాధికారి జీ దినేశ్పాటిల్, పరమేశ్వర్, శివకుమార్, కొండ వీరన్న, విశ్వనాథ్, పృథ్వీరాజ్, వీర నందయా, అనందప్ప, విజయ్కుమార్, భూపేష్సాగర్ తదితరులు పాల్గొన్నారు.