పెద్దపల్లి రూరల్, మే 12: పెద్దపల్లి మం డలం రాగినేడులో వెలిసిన స్వయంభూ శివలింగం వద్ద నిర్మించిన శ్రీ నాగలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పంచాయతన విగ్రహ ప్రతిష్ఠాపనమహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యానంద భారతీస్వామి ఆధ్వర్యంలోని శిష్య బృందం 25 మంది వేద మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమాన్ని జరిపారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా నేతృత్వంలో ఆలయ గోపురంపై కుంభాభిషేకం నిర్వహించారు. ఉత్సవానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, ఎంపీ బో ర్లకుంట వెంకటేశ్ తదితరులు హాజర య్యారు. నిధులు మంజూరు చేసి ఆలయ ని ర్మాణం జరిగేలా చూసిన సీఎం కేసీఆర్కు కోలేటి దామోదర్ కృతజ్ఞతలు తెలిపారు.