మన్సూరాబాద్, మే 25: హైదరాబాద్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ఈ నెల 31న ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి చెప్పా రు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణ సమాజం కోసం సుందరమైన భవనాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు.
మన్సూరాబాద్ చంద్రపురికాలనీలోని శ్రీవైష్ణవ సదనంలో గురువారం శ్రీవైష్ణవ కులస్థులకు గుర్తింపు కార్డుల అందజేత కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, బ్రా హ్మణ పరిషత్తు చైర్మన్ కేవీ రమాణాచారితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణుగోపాలాచారి మాట్లాడుతూ.. బ్రాహ్మణ పరిషత్తు భవనం కోసం గోపనపల్లి వద్ద కోట్ల విలువైన స్థలా న్ని సీఎం కేసీఆర్ కేటాయించారని, మూడంతస్థుల్లో చేపట్టిన భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బ్రాహ్మణ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ రాష్ర్టాల్లో ఇప్పటివరకు బ్రాహ్మణ భవనాలు నిర్మించలేదని వేణుగోపాలచారి తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని బ్రాహ్మ ణ సమాజం కోసం ఈ భవనాన్ని నిర్మించారని పేర్కొన్నారు. దేశంలోని పీఠాధిపతులు, ప్రధా న ఆలయాల్లోని ప్రధాన అర్చకులు, వేద పం డితులు, వివిధ రాష్ర్టాల్లో ఉన్న బ్రాహ్మణ సం ఘం పెద్దలు భవనం ప్రారంభోత్సవానికి హాజరవుతారని తెలిపా రు.
బ్రాహ్మణ, వైష్ణవ, కరణంతోపాటు అన్ని శాఖల ప్రతినిధులను భవ న ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీవైష్ణవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్టీ చారి, డాక్టర్ ఏవై చారి, డాక్టర్ టీవీ శ్రీనివాస్, సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్, ప్రతినిధులు లక్ష్మీనాథాచార్యులు, రత్నకుమార్, బ ద్రీనాథ్, వెంకటాచార్యులు పాల్గొన్నారు.