హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం రాష్ట్ర అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆలయ గొప్పతనాన్ని, విశిష్టతను కండ్లకు కట్టేలా ప్రత్యేక పవర్పాయింట్ ప్రజెంటేషన్ను రూ పొందించారు. చైనాలో ఈ నెల 15 నుంచి జరిగే హెరిటేజ్ కమిటీ సమావేశాల్లో దీనిని ప్రదర్శిస్తారు. సమావేశంలో పాల్గొనే 21 దేశాల ప్రతినిధులను ఆకట్టుకొనేలా ప్రజెంటేషన్ను తయారుచేశారు. రామప్పపై మొదటిదశలో యునెస్కో అడిగిన పలు ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు పంపించింది. రెండోదశలో ఐదు నిమిషాల వీడియోను పంపింది. తర్వాత దానిని రెండు నిమిషాలకు కుదించి ప్యారిస్లోని పర్మనెంట్ డెలిగేషన్ ఆఫ్ ఇండియాకు అందజేసింది. మొత్తం ఆరు భాషల్లో (అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్, రష్యన్, ఇంగ్లిష్) వీడియోను రూపొందించారు. రామప్ప దేవాలయం, కాకతీయ సామ్రాజ్యంపై రెండు కాఫీ టేబుల్ బుక్స్, ఒక బ్రోచర్ను తయారు చేయించి పంపారు.
ఫ్లోటింగ్ బ్రిక్స్ మనకే ప్రత్యేకం
రామప్పను పురాతన కట్టడాల జాబితాలో చేర్చే కసరత్తు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వేగం పుంజుకొన్నదని ఇన్ట్యాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు తెలిపారు. 2009లోనే ప్యారిస్కు వెళ్లి రామప్ప టెంపుల్పై వరల్డ్ ప్యానల్ కమిటీ (ఐపోమాస్)కు వివరించామని. నీటిలో తేలియాడే ఇటుకలపై లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చామని చెప్పారు. వరల్ట్ హెరిటేజ్ లిస్టుకు రామప్ప అర్హత సాధిస్తుందనే ధీమాతో ఉన్నామని తెలిపారు.