హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): హెపిటో సెల్యులార్ కార్సినోమా అనే కాలేయ క్యాన్సర్ (హెచ్సీసీ) బాధితులకు హైదరాబాద్ ఏఐజీ వైద్యు లు తొలిసారిగా ఇమ్యూనోథెరపీని అందుబాటులోకి తీసుకొచ్చారు. హెపటాలజీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంకాలజీ విభాగాలు హెచ్సీసీ రోగులపై పలు అధ్యయనాలు జరిపి అటెజొలిజమాబ్,
బెవసిజమాబ్ సమ్మేళనంతో కూడిన ఇమ్యునోథెరపీని పరిచయం చేసినట్టు వైద్యులు బుధవారం వెల్లడించారు. 29-82 ఏండ్ల వారిపై అధ్యయనంలో కాలేయ క్యాన్సర్కు సంబంధించి 86% మంది పురుషులు ఉన్నారని తెలిపారు. మొ త్తం క్యాన్సర్ రోగుల్లో 74.60 శాతం మంది మూడో దశలోని బర్సెలోన క్లినిక్ లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలిపారు.