హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్) 2019 బ్యాచ్కు చెందిన నలుగురు అధికారుల బృందం శుక్రవారం జూబ్లీహిల్స్లోని టీశాట్ కార్యాలయాన్ని సందర్శించింది. ఆశిశ్ గోయల్, డీ బాలనాగేంద్రన్, కే అనురాగ్కుమార్, శ్రీసాయి వెంపటి బృందం.. స్టూడియో, పీసీఆర్, ఎర్త్స్టేషన్ పనితీరును పరిశీలించింది. ఆరేండ్లుగా టీశాట్ నెట్వర్క్ చానళ్ల ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, రైతులకు అందిస్తున్న సేవలను ఐఐఎస్ బృందానికి టీశాట్ సీఈవో ఆర్ శైలేశ్రెడ్డి వివరించారు.