హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) స్నాతకోత్సవాన్ని సోమవారం నిర్వహించనున్నట్టు ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ రమేశ్ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం స్నాతకోత్సవాన్ని నిజాంకాలేజీ ఆడిటోరియంలో నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో 2,093 మంది విద్యార్థులు పట్టాలు అందుకుంటారని అన్నారు.