హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఏసీబీ డైరెక్టర్గా ఐజీ ఏఆర్ శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏసీబీ ఏడీజీ రవిగుప్తాను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. నగర అడిషనల్ కమిషనర్ (క్రైమ్స్), సిట్ చీఫ్గా ఉన్న ఏఆర్ శ్రీనివాస్ ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీ ప్రక్రియలో ఏసీబీకి బదిలీ అయ్యారు. 1994లో డీఎస్పీగా నియమితులై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు.